Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: గుజరాత్ అసెంబ్లీలో మొత్తం 182 స్థానాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో డిసెంబరు 1న జరిగిన తొలి దశ పోలింగ్ లో 89 స్థానాలకు ఓటింగ్ నిర్వహించారు. నేడు రెండో దశ పోలింగ్ నేటితో ముగిసింది. దీనిలో ఈ సాయంత్రం 5.30 గంటల సమయానికి 59 శాతం ఓటింగ్ నమోదైంది. రెండో దశలో భాగంగా 14 జిల్లాల వ్యాప్తంగా 93 నియోజకవర్గాల్లో పోలింగ్ చేపట్టారు. ఈ రెండు దశలకు కలిపి డిసెంబరు 8న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు.
పలువురు ప్రముఖుల భవితవ్యం ఈ రెండో దశ పోలింగ్ నిర్ణయించనుంది. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ (ఘట్లోడియా), పాటిదార్ ఉద్యమకారుడు హార్దిక్ పటేల్ (విరామ్ గమ్), ఓబీసీ నేత అల్పేష్ ఠాకూర్ (గాంధీ నగర్ సౌత్), జిగ్నేశ్ మేవానీ (వడ్గామ్) తదితరుల నియోజకవర్గాలకు నేడు పోలింగ్ జరిగింది.