Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: 2023 మిస్ ఇండియా పోటీలకు ప్రకటన వెలువడింది. ఈ 59వ మిస్ ఇండియా అందాల పోటీలు మణిపూర్ లో నిర్వహించనున్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి అందాల భామలకు ఆహ్వానం పలుకుతున్నట్టు ఎంఐఓ తెలిపింది. ఢిల్లీ, జమ్మూ కశ్మీర్ సహా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అందాల పోటీలు నిర్వహించి 30 మందితో తుది జాబితా రూపొందించి, వారి నుంచి ఒక అందాల సుందరికి మిస్ ఇండియా కిరీటం తొడుగుతారు.
అందాల పోటీల్లో పాల్గొనేందుకు ఈ కింది అర్హతలు కలిగి వుండాలి.
వయసు: 18 నుంచి 25 ఏళ్ల లోపు ఉండాలి.
ఎత్తు: 5.3 అడుగులు, ఆపైన (హీల్స్ లేకుండా).
బరువు: 51 కిలోలు మించకూడదు.
రిలేషన్ షిప్ స్టేటస్: అవివాహితులై ఉండాలి. ఎవరితోనూ నిశ్చితార్థం జరిగి ఉండకూడదు. గతంలో పెళ్లి చేసుకుని విడిపోయినా అనర్హులు అవుతారు.
నేషనాలిటీ: భారతీయులై ఉండాలి. భారత పాస్ పోర్టు కలిగి ఉండాలి. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డు కలిగి ఉన్న వారు కేవలం సెకండ్ రన్నరప్ కోసం పోటీ పడేందుకు అర్హులవుతారు.
www.missindia.com వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.