Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ కవితను విచారించేందుకు ఇటీవల సీబీఐ నోటీసులు పంపింది. ఈ నెల 6న విచారణ జరుపుతామని, కవితకు అనుకూలమైన చోట విచారిస్తామని కూడా సూచించింది. దీంతో కవిత స్పందిస్తూ, ఎఫ్ఐఆర్ లో తన పేరు లేదని, తాను డిసెంబరు 6న విచారణకు హాజరుకాలేనని స్పష్టం చేస్తూ సీబీఐకి లేఖ రాశారు. తాను 11, 12, 14, 15 తేదీల్లో అందుబాటులో ఉంటానంటూ కొన్ని తేదీలను తెలిపింది. ఈ క్రమంలో సీబీఐ నేడు కవితకు బదులిచ్చింది. ఈ నెల 11న విచారణకు అందుబాటులో ఉండాలని, హైదరాబాదులోని తన నివాసంలోనే విచారణ జరుపుతామని, ఉదయం 11 గంటలకు విచారణ ఉంటుందని సీబీఐ వెల్లడించింది. ఈ మేరకు ఓ ఈ-మెయిల్ ద్వారా కవితకు సమాచారం అందించింది.