Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 11 కేంద్రాల్లో ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. గురువారం ఉదయం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, నల్లగొండ, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్లోని కేంద్రాలకు అభ్యర్థులు చేరుకున్నారు. అభ్యర్థులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం కేంద్రాల్లోకి అనుమతించారు. ఇక నల్లగొండలోని మేకల అభినవ్ స్టేడియంలో పరుగుపందెం కొనసాగుతున్నది. దేహదారుఢ్య పరీక్షలకు సంబంధించిన ప్రతి దశనూ సీసీ కెమెరాలతో నమోదు చేస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం జనవరి మొదటివారంలో ఫిజికల్ ఈవెంట్స్ ప్రక్రియ పూర్తికానుంది.