Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒడిశా: కాందమాల్ జిల్లా, మటకుప రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. తాడికొల గ్రామ సమీపంలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా.. పసిగట్టిన మావోయిస్టులు పోలీసులపై కాల్పులు జరిపారు. దీంతో బలగాలు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందగా మరికొందరు తప్పించుకున్నారు. మరణించినవారు ఛత్తీస్గఢ్కు చెందిన ఏసీఎం కమల, మరో మహిళగా గుర్తించారు. ఆమె వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటన ప్రదేశంలో మారణాయుధాలు, మావోయిస్టు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.