Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లు వచ్చే ఏడాది భారత పర్యటనకు రానున్నాయి. తొలుత శ్రీలంక టీమిండియాతో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. న్యూజిలాండ్ కూడా మూడు వన్డేలు, మూడు టీ20ల్లో పోటీ పడనుంది. ఆస్ట్రేలియా మాత్రం నాలుగు టెస్టుల సిరీస్ తో పాటు మూడు వన్డేల్లో భారత్ తో తలపడుంది. ఈ సిరీస్ లకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ను బీసీసీఐ గురువారం ఖరారు చేసింది. మ్యాచ్ లు జరిగే తేదీలను, వేదికలను ప్రకటించింది.
దీనిలో తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్, వైజాగ్ లకు అవకాశం దక్కడం విశేషం. జనవరి 18వ తేదీన న్యూజిలాండ్ తో తొలి వన్డేకు హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. మార్చి 19వ తేదీన ఆస్ట్రేలియాతో రెండో వన్డేకు వైజాగ్ ను వేదికగా ఎంపిక చేసిన బీసీసీఐ తెలుగు రాష్ట్రాల్లోని క్రికెట్ అభిమానులకు శుభవార్త చెప్పింది. ఈ విషయాలను బీసీసీఐ ట్విట్టర్ ద్వారా పంచుకుంది.