Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: 2023 లో భాగంగా ఓటరు నమోదుకు గడువు గురువారం (నేడు)తో ముగుస్తోంది. ఎన్నికల సంఘం నవంబర్ 9న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేసింది. ఈ తరుణంలో ముసాయిదా ఓటరు జాబితాలో పేర్లు తప్పులను సవరించుకొనేందుకు, నూతన ఓటరు నమోదు కొరకు డిసెంబర్ 8 వరకు గడువు ఇచ్చింది. ఓటరు జాబితాలో గల ఇంటి చిరునామా సవరణ, ఇతర నియోజక వర్గాలకు బదిలీ, ఓటరు గుర్తింపు కార్డులో తప్పుల సవరణ, దివ్యాంగుల గుర్తింపు కోసం అభ్యర్థణ, అభ్యంతరాల కోసం ఈ వెలుసుబాటు కల్పించింది. నేటితో ఈ గడువు ముగుస్తుంది. కొత్త ఓటరు నమోదు, మార్పులకు www.nvsp.in వెబ్ www.voterhelpline అనే యాప్ ను ఉపయోగించుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.
అంతే కాకుండా భారత ఎన్నికల కమిషన్ ఏడాదికి 4 అర్హత తేదీల (జనవరి 1 ,ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1) నాటికి 18 సంవత్సరాలు పూర్తయ్యే వారు ఓటు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఓటరు జాబితాలో పేరున్న వారు ఆధార్ అనుసంధానం చేసుకోవాలని సూచించారు