Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ అర్ధాంగి డింపుల్ యాదవ్ మెయిన్ పురి పార్లమెంటు స్థానం ఉప ఎన్నికలో భారీ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి రఘురాజ్ సింగ్ షాక్యాపై 2,88,461 ఓట్ల మెజారిటీతో డింపుల్ యాదవ్ గెలుపొందారు. మెయిన్ పురి సమాజ్ వాదీ పార్టీకి కంచుకోట వంటిది. గతంలో ఇక్కడ సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ గెలుపొందారు. అయితే అక్టోబరు 10న ఆయన కన్నుమూయడంతో, మెయిన్ పురి లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది. 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ములాయం 94 వేల ఓట్ల మెజారిటీతో బీజేపీ నేత ప్రేమ్ సింగ్ షాక్యాపై గెలిచారు. ఇప్పుడాయన కోడలు అంతకుమించిన మెజారిటీతో జయభేరి మోగించడం విశేషం. ఈ ఉప ఎన్నికలో డింపుల్ కు 6,18,120 ఓట్లు రాగా, ఆమె ప్రత్యర్థి రఘురాజ్ సింగ్ షాక్యా 3,29,659 ఓట్లు పొందారు.