Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరో భారీ ప్రాజెక్టు మెట్రో రైల్ రెండో దశకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవ్వాళ శంకుస్థాపన చేశారు. నాగోల్-రాయదుర్గం కారిడార్ కు కొనసాగింపుగా దీన్ని నిర్మించనున్నారు. రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు నిర్మించనున్న ఎయిర్ పోర్ట్ ఎక్స్ ప్రెస్ మెట్రోకు మైండ్ స్పేస్ వద్ద కేసీఆర్ భూమిపూజ చేసి ప్రత్యేక పునాదిరాయి వేశారు.
ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అయితే 31 కిలోమీటర్ల మేర ఈ మెట్రో లైన్ ను నిర్మించనున్నారు. రూ. 6,250 కోట్ల అంచనాలతో ఈ ప్రాజెక్టును చేపట్టగా, మూడేళ్లలోగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మెట్రో లైన్ నిర్మాణానికి మొత్తం నిధులను రాష్ట్ర ప్రభుత్వమే అందిస్తుండడం విశేషం. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఎయిర్ పోర్టుకు 20 నిమిషాల్లోనే చేరుకునే అవకాశం ఉండనుంది.