Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చట్టోగ్రామ్: ఇషాన్ కిషన్ వన్డేల్లో నాలుగవ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. బంగ్లాదేశ్తో జరుగుతున్న మూడవ వన్డేలో ఇషాన్ కేవలం 49 బంతుల్లో అర్థశతకం పూర్తి చేశాడు. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత ఇండియాను బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఓపెనర్ శిఖర్ ధావన్ త్వరగా ఔటయ్యాడు. అయితే కిషన్ దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. 49 బంతుల్లో అతను ఏడు ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. తాజా సమాచారం ప్రకారం ఇండియా 14 ఓవర్లలో వికెట్ నష్టానికి 74 రన్స్ చేసింది.