Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఛట్టోగ్రామ్ లో బంగ్లాదేశ్ తో జరుగుతున్న చివరిదైన మూడో వన్డేలో టీమిండియా అతి భారీ స్కోరు చేసింది. ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ, కోహ్లీ సెంచరీ సాయంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 409 పరుగులు చేయడం విశేషం.
దీనిలో ఇషాన్ కిషన్ 131 బంతుల్లో 210 పరుగులు చేయగా, కోహ్లీ తన 91 బంతుల్లో 113 పరుగులు చేశాడు. వాషింగ్టన్ సుందర్ 37, అక్షర్ పటేల్ 20 పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 2, షకీబల్ హసన్ 2, ఇబాదత్ హుస్సేన్ 2, ముస్తాఫిజూర్ రెహ్మాన్ 1, మెహిదీ హసన్ 1 వికెట్ తీశారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేస్తూ ప్రస్తుతానికి 4 ఓవర్లలో 33 పరుగులు చేసింది.