Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వనపర్తి: జిల్లాలోని కొత్తకోట సమీపంలో ప్యాసింజర్ జీపు బోల్తాపడింది. దీంతో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. కానాయపల్లికి చెందిన 14 మంది క్రూయిజర్లో హైదరాబాద్లో వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వస్తున్నారు. ఈ క్రమంలో పాలెం బ్రిడ్జి వద్ద అదుపుతప్పి పంట పొలాలకు దూసుకెళ్లి బోల్తా పడింది. దీంతో అందులో ఉన్నవాళ్లంతా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో క్షతగాత్రులను దవాఖానకు తలించారు. వారిలో ఇద్దరి మహిళల పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. బాధితుల వివరాలు తెలియాల్సి ఉన్నది. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.