Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: టాలీవుడ్లోనూ మంచి పాపులారిటీ ఉన్న తమిళ నటుడు శరత్ కుమార్. ఈ నటుడు తీవ్ర అస్వస్థత కారణంగా శరత్ కుమార్ చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరినట్లుగా తెలుస్తోంది. డయేరియాతో డిహైడ్రేషన్కు అవ్వడంతో ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. దీంతో హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు భార్య రాధికా శరత్ కుమార్, ఆయన కూతురు వరలక్ష్మి శరత్ కుమార్. కాగా.. కంగారు పడాల్సిన అవసరం లేదని సన్నిహితులు చెబుతున్నారు. అయితే.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు నుంచి ఎలాంటి స్పందన లేదు. అలాగే ఆసుపత్రి వర్గాలు ఎలాంటి మెడికల్ బులిటెన్ను విడుదల చేయలేదు. ఈ విషయం తెలిసిన ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.