Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సీబీఐ బృందం ఆదివారం ఎమ్మెల్సీ కవితను విచారణ చేయునున్నారు. ఈ నేపథ్యంలో న్యాయవాదులు కవిత ఇంటికి చేరుకున్నారు. న్యాయవాదుల సంక్షంలోనే అధికారులు కవితను విచారించనున్నారు. దీంతో కవిత ఇంటి పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. కాగా నిన్న (శనివారం) సాయంత్రం సీబీఐ బృందం హైదరాబాద్కు చేరుకుంది.
సీబీఐ అధికారులు బంజారాహిల్స్లోని కవిత నివాసంలోనే ఈ ఉదయం 11 గంటలకు విచారణ చేసి, స్టేట్మెంట్ను రికార్డు చేయనున్నారు. ఈ కేసులో అరెస్టయిన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరు ఉండడంతో 160 సీఆర్పీసీ కింద సీబీఐ కవితకు నోటీసులను జారీ చేసింది. కాగా ఈ నెల 6వ తేదీన కవితను సీబీఐ అధికారులు విచారించాల్సింది. అయితే ఇతర కార్యక్రమాల్లో ఆమె బిజీగా ఉండటంతో 11వ తేదీన అందుబాటులో ఉంటానని సీబీఐకి సమాచారం ఇచ్చారు. దీంతో ఇవాళ సీబీఐ అధికారులు కవిత ఇంటికి వెళ్లి విచారించనున్నారు. ప్రస్తుతానికి ఈ కేసులో కవితను సాక్షిగానే సీబీఐ అధికారులు ప్రశ్నిస్తారని న్యాయ నిపుణులు చెబుతున్నారు.