Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొంపల్లి ఎస్బీఐలో ఆదివారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఎంత మేర ఆస్తి నష్టం జరిగిందో అధికారులు అంచాన వేస్తున్నారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.