Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నవీపేట్
పెళ్లిరోజే ఇంట్లో దూలానికి ఉరి వేసుకుని పెళ్లికూతురు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలోని కోమటి గల్లికి చెందిన ర్యాగళ్ల రవళి(26) కి రెండు నెలల క్రితం నిజామాబాద్ కి చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి సంతోష్ తో నిశ్చితార్థం అయింది. ఆదివారం ఉదయమే నిజామాబాద్ లో పెళ్లికి వెళ్లాల్సిన వధువు వేకువ జామున ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన తండ్రి ప్రభాకర్ లబోదిబో మనడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. సమాచారం మేరకు ఎస్సై రాజారెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతికి వరుడు ఉద్యోగం చేయాలని వేధించడమే కారణమని మృతురాలి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.