Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్కు చెందిన బోయింగ్ బీ-737 విమానం శనివారం కేరళలోని కోజికోడ్ నుంచి దుబాయ్కు ప్రయాణించింది. ఆ విమానం దుబాయ్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది. అయితే ఆ విమానంలోని కార్గో భాగంలో పాము ఉన్నట్లు సిబ్బంది గమనించారు. వెంటనే ఎయిర్పోర్ట్లోని ఫైర్ సిబ్బందికి ఈ సమాచారం అందించారు. ఈ తరుణంలో విమానంలోని ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు. అనంతరం ఆ విమానం అంతా క్రిమి సంహారక మందును స్ప్రే చేశారు. మరోవైపు దేశంలోని విమానయాన నియంత్రణ సంస్థ అయిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కు ఈ విషయం తెలిసింది. ఈ క్రమంలో విమానంలో పాము కనిపించిన సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించింది.