Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మాండస్ తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వానలు పడుతాయని పేర్కొన్నది. తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి రాష్ట్రంలోకి గాలులు వీస్తున్నాయని, ఈ ప్రభావంతో ఉష్ణోగ్రతలు పడిపోయి చలి తీవ్రత పెరుగుతున్నదని చెప్పింది. ఆదివారం మెదక్లో 17 డిగ్రీలు, నల్లగొండ 17.2, ఆదిలాబాద్లో 17.7, హకీంపేట 18.9, హనుమకొండ 19, హైదరాబాద్ 19.2, దుండిగల్ 20, రామగుండం 20, నిజామాబాద్ 20.5, ఖమ్మం 20.6, మహబూబ్నగర్ 21.5, భద్రాచలంలో 24 డిగ్రీల చొప్పున కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.
శనివారం ఉదయం ఏర్పడిన తీవ్ర వాయుగుండం బలహీనపడి, సాయంత్రం వాయుగుండంగా, ఆదివారం ఉదయం ఐదున్నర గంటలకు తీవ్ర అల్పపీడనంగా మారిందని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం ఈ అల్పపీడనం కూడా బలహీనపడిందని చెప్పింది. మాండస్ తుఫాను ప్రభావంతో హైదరాబాద్లో ముసురు వాన కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం నుంచి చిరుజల్లులు కురుస్తున్నా యి. 13న పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడా చిరు జల్లులు కురిశాయి.