Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : యాక్షన్ హీరో విశాల్ కథానాయకుడిగా ఏ వినోద్ కుమార్ దర్శకత్వంలో రానా ప్రొడక్షన్స్పై రాబోతోన్న హై ఆక్టేవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'లాఠీ'. రమణ, నంద సంయుక్త నిర్మాణంలో భారీగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ మెటిరీయల్ సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి. ఇక నేడు ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేశారు. పవర్ పుల్ యాక్షన్ తో ట్రైలర్ అదిరిపోయింది. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో లాఠీ విడుదల కానుంది. ఈచిత్రంలో విశాల్ సరసన సునయన హీరోయిన్గా నటిస్తోంది. లాఠీలో అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్లు ఉండబోతోన్నాయి. ద్వితీయార్థంలో ఉండే 45 నిమిషాల యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలెట్ అవ్వనుంది. దిలీప్ సుబ్బరాయణ్ అద్భుతమైన ఫైట్ సీక్వెన్స్లను కంపోజ్ చేశారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి బాలసుబ్రమణ్యన్ కెమెరామెన్గా, పార్థిబన్ రచయితగా పని చేస్తున్నారు.