Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ఢిల్లీకి చేరుకున్నారు. ఈ నెల 14వ తేదీన బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయ భవనం ప్రారంభోత్సవం ఉన్న నేపథ్యంలో కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు. అంతకు ముందు సాయంత్రం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరిన ఆయన.. ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో కేసీఆర్కు బీఆర్ఎస్ ఎంపీలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ నెల 14న బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయ భవనం ప్రారంభోత్సవం ఉన్న నేపథ్యంలో ఆయన ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది. అదే రోజు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంతో పాటు పలువురు జాతీయ నేతలతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు.