Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఎముకలు కొరికే చలిని తట్టుకోలేక ఓ మహిళ ఎండ కోసం తన ఇంటి నుంచి బయటకు వచ్చింది. అదే సమయంలో అటుగా వచ్చిన ఓ దొంగ తుపాకీతో బెదిరించి, ఆమె వద్ద ఉన్న బంగారం, కుమారుడి వద్ద ఉన్న మొబైల్ ఫోన్ను ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఘజియాబాద్లోని డీఎల్ఎఫ్ అంకుర్ విహార్ కాలనీలో అశోక్ గుప్తా అనే వ్యక్తి తన భార్య, కుమారుడితో కలిసి ఉంటున్నాడు. గుప్తా భార్య గీత.. చలిని తట్టుకోలేక సోమవారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వచ్చింది. అదే సమయంలో ఓ ఇద్దరు వ్యక్తులు బైక్పై వచ్చారు. ఒకరు బైక్ దిగి.. తుపాకీతో మహిళను బెదిరించారు. దీంతో ఆమె వద్ద ఉన్న బంగారం ఇచ్చేసింది. పక్కనే ఉన్న కుమారుడిని కూడా బెదిరించి, అతని వద్ద మొబైల్ను దొంగిలించారు. ఈ దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. బాధితురాలు గీత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.