Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: దేశం సుభిక్షత కోసం, బీఆర్ఎస్ పార్టీ విజయవంతం కావాలని కాంక్షిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో ఇవ్వాళ రాజశ్యామల యాగం ప్రారంభించారు. ఈ యాగం కోసం ఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ముందుగానే ప్రత్యేక యాగశాలను నిర్మించారు.
ఇవాళ ఉదయం 11 గంటలకు 12 మంది ఋత్విక్కులు గణపతి పూజతో రాజశ్యామల యాగానికి శ్రీకారం చుట్టారు. ఇవాళ పుణ్యహవాచనం, యాగశాల ప్రవేశం, చండీ పారాయణం, మూలమంత్ర జపాలు నిర్వహించనున్నారు. రేపు (బుధవారం) నవ చండీహోమం, రాజశ్యామల హోమం అనంతరం పూర్ణాహుతి కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఈ యాగంలో పలువురు బీఆర్ఎస్ నేతలు పాల్గోన్నారు.