Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
సోషలిజం సాదిద్దాం మతోన్మాదం అంతం చేద్దాం ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదాలతో హైదరాబాద్ హుస్సేన్ సాగర్ పరిసరం మార్మోగింది. ఎస్ ఎఫ్ ఐ 17వ జాతీయ మహాసభలు ప్రారంభం సందర్భంగా ప్రసాద్ ఐమాక్స్ నుంచి నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా వరకు విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థులు ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు.
ఉదయం 11.30గంటలకు ర్యాలీ ని ఎస్ ఎఫ్ ఐ జాతీయ అధ్యక్షులు విపి సాను, జాతీయ ప్రధాన కార్యదర్శి మయుక్ బిశ్వాస్, తెలంగాణ రాష్ట్ర ఎస్ ఎఫ్ ఐ అధ్యక్ష కార్యదర్శులు ప్రారంభించారు. విప్లవ వీరులు భగత్ సింగ్, చేగువేరా జెండాలు, ఎస్ ఎఫ్ ఐ బ్యానర్లు తో నెక్లెస్ రోడ్ కళ కళ లాడింది. స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం జెండాలు రెప రెప లాడాయి. ఇంక్విలాల్ జిందాబాద్ సోషలిజం సాధిస్తమంటూ విద్యార్థులు నినదించారు. ఉత్తరా ఖంద్, మహారాష్ట్ర, బెంగాల్, కేరళ, యుపి, ఎపి, తమిళనాడు, కర్ణాటక, రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థినులు చేసిన నినాదాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి.
వీ వాంట్ న్యూ ఇండియా, అప్ అప్ సోషలిజం డౌన్ డౌన్ క్యాప్ట లిజం, అంటూ గొంతె త్తారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ విద్యార్థి ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదిగదిగో ఎస్ ఎఫ్ ఐ అంటూ పాటలు ఆలపిస్తూ స్థానిక విద్యార్థులు పెద్దఎత్తున ర్యాలీ లో పాల్గొన్నారు. కులం కుల్లురా మతం మత్తురా అంటూ విద్యార్థులు పాడిన పాటలు ఆలోచింపజేసాయి. ప్రజా నాట్యమండలి డప్పు దరువులు విద్యార్ధినుల ఆట పాటలతో ర్యాలీ ఉత్సాహంగా సాగింది. విశాల భారత మంతటా ఎస్ ఎఫ్ ఐ విజయ బావుటా అంటూ విద్యార్థులు ఎస్ ఎఫ్ ఐ లక్ష్యాలను నినదిస్తూ బహిరంగ సభ జరిగే పీపుల్స్ ప్లాజా వరకు ర్యాలీ నిర్వహించారు.