Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ప్రజాస్వామ్య వ్యవస్థల విధ్వంసంపై శంఖారావం | తాజా వార్తలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • తాజా వార్తలు
  • ➲
  • స్టోరి
  • Dec 13,2022

ప్రజాస్వామ్య వ్యవస్థల విధ్వంసంపై శంఖారావం

- ఆర్‌ఎస్‌ఆర్‌, బీజేపీ తిరోగమన విధానాలను అడ్డుకోవాలి
- హిందూ రాష్ట్ర నినాదం దేశ విచ్ఛిన్నానికి పునాది
- సంపన్నుల పాలిట మోడీ సర్కారు కల్పతరువు
- పేదలను విద్యకు దూరం చేసేందుకే నూతన విద్యావిధానం
జాతీయోద్యమం తరహాలో ఉద్యమాలు
- విద్యార్థుల సమస్యలపై పోరాటమే కాదు...నిరుపేదల హక్కుల కోసం నిలబడాలి
- ఎస్‌ఎఫ్‌ఐ బహిరంగ సభలో త్రిపుర మాజీ సీఎం మాణిక్‌ సర్కార్‌ పిలుపు
హైద‌రాబాద్  : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజాస్వామ్య వ్యవస్థలను విధ్వంసం చేస్తున్నదనీ, దాన్ని అడ్డకునేందుకు శంఖారావం పూరించాలని త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కారు పిలుపునిచ్చారు. ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ దేశాన్ని తిరోగమనం వైపు తీసుకెళ్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయోద్యమం తరహాలో ఉద్యమించి, ఆ విధానాలను తిప్పికొట్టాలని చెప్పారు. కుల, మతం పేరిట దేశాన్ని విభజించే కుట్ర చేస్తున్నదని విమర్శించారు. ఆ పార్టీ హిందూ రాష్ట్ర నినాదం దేశ విచ్ఛినానికి దారి తీస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకనుగుణంగా విద్యావిధానంలో మార్పులు చేసేందుకు నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చిందని చెప్పారు. ఈ విద్యా విధానం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, నిరుపేదలకు విద్యను దూరం చేయడమే లక్ష్యంగా ఉందన్నారు. మూఢనమ్మకాలు, అంధ విశ్వాసాలను పెంచి పోషించేలా చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. విద్యార్థులు విద్యారంగ సమస్యలపై పోరాడడమే కాకుండా నిరుపేదల హక్కుల కోసం నిలడాలని కోరారు. అంతకు ముందు హైమాక్స్‌ థియెటర్‌ నుంచి నెక్లెస్‌రోడ్‌ భారీ ప్రదర్శన నిర్వహించారు. సారర్‌ తీరం విద్యార్థులతో జనసంద్రమైంది. ఎస్‌ఎఫ్‌ఐ 17వ అఖిల భారత మహాసభలను పురస్కరించుకుని మంగళవారం హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్‌లోని ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షులు వి.పి సాను అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో మాణిక్‌ సర్కార్‌ మాట్లాడారు. దేశంలో విద్యారంగం దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నదని చెప్పారు. ప్రజాస్వామ్యానికి పూర్తి భిన్నమైన, హనికరమైన నియంతృత్వ విధానాలతో బీజేపీ సర్కారు ముందుకు పోతున్నదన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ పథకం ప్రకారం విద్యను ధ్వంసం చేస్తున్నదని విమర్శించారు. సంపన్నులు, కార్పొరేట్లకు అనూకూలంగానూ, నిరుపేదలకు ప్రతికూలంగా ఉందని చెప్పారు.
కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే నూతన విద్యావిధానం
కార్పొరేట్ల వర్గప్రయోజనాల కోసం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నదని మాణిక్‌ సర్కార్‌ తెలిపారు. రాజ్యాంగంలో కల్పించిన హక్కులకు తూట్లు పోడుస్తున్నదని చెప్పారు. ఇవన్నీ కూడా బీజేపీకి తెలియకుండానో, యాధృచ్ఛింగానో జరగడం లేదనీ, ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్య ప్రయివేటీకరణ చేయడం ద్వారా కార్పొరేట్లకు లాభాల పంట పండిస్తున్నదని చెప్పారు. ఇలాంటి చర్యలతో ఎస్సీ, ఎస్టీ, ఆదివాసీ, పేదలు, ఆర్థికంగా వెనకబడిన వర్గాలు విద్యకు పూర్తిగా దూరమవుతారని చెప్పారు. పేదలకు విద్యను దూరం చేయడం అత్యంత ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. పాఠ్యాంశాలు, సిలబస్‌, విద్యాబోధనను సైతం కేంద్రం నియంత్రణ చేస్తున్నదని విమర్శించారు. శాస్త్రీయ విద్య, వైజ్ఞానానికి అవగాహన కల్పించాల్సిన విద్యా విధానం...మూఢనమ్మకాలను అందిస్తున్నదని తెలిపారు. కుల, మత విద్వేషాలు తప్ప... విద్యార్థుల్లో సేవా గుణం, ధీనులకు తోడ్పడే విధంగా లేదన్నారు. కలుషితమైన విద్యతో ప్రజల మధ్య అంతరాలు పెరుగుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. చైతన్య దీపికలుగా ఉండాల్సిన విశ్వవిద్యాలయాలు వినాశనకరమైన అంశాలను జోప్పిస్తున్నాయని తెలిపారు. విద్యరంగంలో మౌలిక సదుపాయాల కోసమే కాకుండా అన్ని వర్గాల ప్రజల హక్కుల కోసం ఉద్యమించేలా కార్యాచరణ చేపట్టాలని కోరారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య హక్కులు, ఫెడరలిజం, సామ్యవాదం వంటి దేశ వారసత్వాన్ని బీజేపీ దెబ్బతీస్తున్నదని విమర్శించారు.
నిరంతరాయంగా పెరుగుతున్న నిరుద్యోగం
దేశంలో నిరుద్యోగం నిరంతరాయంగా పెరుగుతున్నదని మాణిక్‌ సర్కార్‌ ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చారనీ, ఆ లెక్క ప్రకారం 12 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండేదన్నారు. ప్రభుత్వ శాఖల్లో లక్షల ఉద్యోగాలు ఖాళీలుగా కనిపిస్తున్నా...వాటిని నింపే ప్రయత్నం చేయడం లేదని విమర్శించారు. ఇంజనీరింగ్‌, డాక్టర్‌ వంటి చదువులు చదివినప్పటికీ గ్రూప్‌ 4 ఉద్యోగాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వంద ఉద్యోగాలకు 50 వేల మంది దరఖాస్తు చేసుకుంటున్నారని తెలిపారు. చివరకు అగ్నిపథ్‌ పేరుతో సైన్యంలోనూ తాత్కాలిక ఉద్యోగాలు నింపుతున్నదని చెప్పారు. దేశం కోసం పోరాడాల్సిన వారిని కూడా కాంట్రాక్టు పద్దతిలో నింపుతున్నారంటే, వారికి దేశ భక్తి ఏంటో అర్థమవుతుందని విమర్శించారు.
ప్రమాదపుటంచుల్లో ప్రజలు
బీజేపీ పాలనలో ప్రజలు ప్రమాదపుటంచుల్లో పడ్డారని మాణిక్‌ సర్కార్‌ చెప్పారు. రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రైతులు ఏడాది కాలంపాటు ఢిల్లో పోరాటం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా మోడీ సర్కారు రైతులకు అనేక హామీలు ఇచ్చిందని గుర్తు చేశారు. ఎరువుల సబ్సిడీ ఎత్తివేత, గిట్టుబాటు ధరలు కల్పించకపోవడం, కార్మికుల హక్కలను కాలరాయడం, పోరాడి సాధించుకున్న 42 కార్మిక హక్కులను హరించడం వంటి చర్యలకు పాల్పడ్డారని విమర్శించారు. కార్పొరేట్లు, సంపన్నుల కొమ్ముకాస్తూ...కార్మికుల హక్కులను అణిచివేస్తున్నదని విమర్శించారు. ఎన్నికల సంఘాన్ని, న్యాయవ్యవస్థలను బీజేపీ సర్కారు తమ గుప్పిట్లో పెట్టుకుందని తెలిపారు.
పార్లమెంటరీ వ్యవస్థను దెబ్బతీస్తున్న బీజేపీ
పార్లమెంటరీ వ్యవస్థ సైతం క్షేమంగా లేదనీ, ప్రతిపక్షాలను కొనుగోలు చేసి ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్నదని మాణిక్‌ సర్కార్‌ విమర్శించారు. ఒకే జాతి, ఒకే మతం పేరుతో హిందూ రాష్ట్రం ఏర్పాటుకు కుట్రలు చేస్తున్నదని చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ఫాసిస్టు తరహా విధానాల్లో భాగంగా ప్రభుత్వ ఆస్తులను ప్రయివేటీకరిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. దేశానికి ప్రమాదకరంగా పరిణమించిన బీజేపీ సిద్ధాంతాన్ని ఓడించేందుకు ఎస్‌ఎఫ్‌ఐ సమర శంఖారావం పూరించాలని పిలుపునిచ్చారు.
ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి మయూక్‌ బిస్వాస్‌ మాట్లాడుతూ విద్యావ్యవస్థను సర్వనాశనం చేస్తున్న కేంద్రంలోని ఫాసిస్టు తరహా బీజేపీ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్ధులకు స్కాలర్‌షిప్స్‌ నిలిపివేసిందన్నారు. హాస్టల్స్‌ కూడా మూసివేసిందని విమర్శించారు. మహాసభలకు రాకుండా గుజరాత్‌ రాష్ట్ర విద్యార్ధి నాయకులను అక్కడ బీజేపీ ప్రభుత్వం అడ్డుకుందని చెప్పారు. విద్యార్ధి అమరవీరుల స్ఫూర్తితో విద్యారంగ పరిరక్షణకు ఎస్‌ఎఫ్‌ఐ పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. సోషలిజం కోసం ఎస్‌ఎఫ్‌ఐ పని చేస్తుందని ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ గర్ల్స్‌ కన్వీనర్‌ థీప్సితా ధర్‌ చెప్పారు. పదేండ్ల వయస్సులోనే మల్లు స్వరాజ్యం నిజాం దొరకు వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొన్నారనీ, ఆమె స్ఫూర్తితో విద్యార్ధులందరూ ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు.
విద్యార్థి ఉద్యమంలో అసువులు బాసిన ఎస్‌ఎఫ్‌ఐ నేత ధీరజ్‌ అమరజ్యోతిని తండ్రి రాజేంద్రన్‌కు అందించారు. ఈ సందర్భంగా అమరవీరులను స్మరించుకున్నారు. ఈ సభలో ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ నాయకులు దీనిత్‌ డెంటా, నితిస్‌ నారాయణ్‌, సచిన్‌దేవ్‌, వినీష్‌, మరియప్పన్‌, జేఎన్‌యూ అధ్యక్షులు ఘోష్‌, బంగ్లాదేశ్‌ విద్యార్థినేత దీపక్‌ సింగ్‌, తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్‌ ఆర్‌ఎల్‌ మూర్తి, నాగరాజు, ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్ష, కార్యదర్శులు ప్రసన్న, అశోక్‌, అనుశ్రీ, పూజా అభిషేక్‌నందన్‌ తదితరులు ఉన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఒక్క బంతికి 18 పరుగులు…
రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .
ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..
క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !
8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి
విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై
ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్
దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు
కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్
తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు
సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట
శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌
100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ
నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు
నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌
మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌
నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన
దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి
ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు
పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి
రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి
నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం
తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి
కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్
ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు
మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ
యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం
18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం
బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.