Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశం సుభిక్షంగా ఉండాలని, బీఆర్ఎస్ పార్టీ విజయవంతం కావాలని కాంక్షిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో నిర్వహిస్తున్న రాజశ్యామల యాగం కొనసాగుతున్నది. ఈ రాజశ్యామల యాగం కోసం పార్టీ కార్యాలయంలో ప్రత్యేక యాగశాలను నిర్మించారు. అధినేత కేసీఆర్తోపాటు పలువురు బీఆర్ఎస్ నేతలు ఈ రాజశ్యామల యాగానికి హాజరయ్యారు. ఈ యాగం మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. 12 మంది ఋత్విక్కులు గణపతి పూజతో రాజశ్యామల యాగానికి శ్రీకారం చుట్టారు. యాగం కోసం 12 మంది ఋత్విక్కులు సోమవారమే ఢిల్లీకి చేరుకున్నారు. మంగళవారం పుణ్యహవాచనం, యాగశాల ప్రవేశం, చండీపారాయణం, మూలమంత్ర జపాలు నిర్వహించారు. ఇవాళ నవ చండీహోమం, రాజశ్యామల హోమం అనంతరం పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. శృంగేరిపీఠం గోపీకృష్ణశర్మ, ఫణి శశాంకశర్మ ఆధ్వర్యంలో యాగాలు జరుగుతున్నాయి.