Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో .. భారత బ్యాటర్లు చతేశ్వర్ పూజారా, శ్రేయాస్ అయ్యర్లిద్దరూ హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. తాజా సమాచారం ప్రకారం 69 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 218 రన్స్ చేసింది. పూజారా 68, శ్రేయాస్ 59 రన్స్తో క్రీజ్లో ఉన్నారు. ఇప్పటి వరకు ఇద్దరూ అజేయంగా 106 రన్స్ జోడించారు. ఇండియన్ ఇన్నింగ్స్లో గిల్ 20, రాహుల్ 22, పంత్ 46 రన్స్ చేసి ఔటయ్యారు. పూజారాకు ఇది టెస్టుల్లో 34వ సెంచరీ కాగా, శ్రేయాస్ అయ్యర్కు ఇది నాలుగవ హాఫ్ సెంచరీ.