Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: బంగ్లాదేశ్ తో జరుగుతున్న మొదటి టెస్టులో టీమిండియా తొలి రోజు ఆటను ముగించింది. 112 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన టీమిండియాను పుజారా, శ్రేయాస్ అయ్యర్ జోడీ నిలబడి కాపాడింది. పుజారా 203 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లతో 90 పరుగులు చేసి లెఫ్టార్మ్ స్పిన్నర్ తైజుల్ ఇస్లామ్ బౌలింగ్ లో బౌల్డయ్యాడు. శ్రేయాస్ అయ్యర్ మాత్రం తన వికెట్ ను కాపాడుకున్నాడు. అయ్యర్ 169 బంతుల్లో 10 ఫోర్లతో 82 పరుగులు సాధించాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ మొదటి రోజు ఆట చివరికి 6 వికెట్లకు 278 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్ 82 పరుగులతో క్రీజులో ఉన్నాడు. పుజారా (90) సెంచరీ మిస్సయ్యాడు. వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషబ్ పంత్ దూకుడుగా ఆడి 45 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో 46 పరుగులు చేశాడు.