Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఈ నెల 18న పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో జనసేన పార్టీ కౌలు రైతు భరోసా కార్యక్రమం చేపడుతున్నట్టు ఆ పార్టీ అగ్రనేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ తరుణంలో ఆయన మాట్లాడుతూ మూడేళ్లలో అధికారిక లెక్కల ప్రకారం 1,673 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, రైతు స్వరాజ్య వేదిక సర్వే ప్రకారం ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల సంఖ్య 3 వేలకు పైనే ఉందని తెలిపారు. ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు జనసేన పార్టీ నుంచి రూ.1 లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నామని, ఇప్పటివరకు 7 జిల్లాల్లో కౌలు రైతు భరోసా యాత్ర కార్యక్రమం పూర్తయిందన్నారు.