Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: రంజీ ట్రోఫీ 2022-23 సీజన్ తొలి రెండు మ్యాచ్లకు ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు 20 ఏళ్ల యశ్ ధుల్ సారథ్యం వహించనున్నాడు. అయితే జట్టులో ఇషాంత్ శర్మ, నితీష్ రాణా వంటి సీనియర్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ జట్టు మేనేజేమెంట్ యశ్ ధుల్కి సారథ్య బాధ్యతలు అప్పజెప్పడం విశేషం.
అంతే కాకుండా అతడి సారథ్యంలోనే యువ భారత జట్టు ఈ ఏడాది అండర్-19 ప్రపంచకప్ ను భారత్ పోంతం చేసుకుంది. అతడి కెప్టెన్సీ నైపుణ్యాలు చూసి ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ తమ జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.