Authorization
Fri May 16, 2025 08:17:54 pm
- నీట్, జేఈఈ, సీయూఈటీలను వ్యతిరేకిస్తున్నాం
- అందరికీ విద్య అందాలన్నదే మా ధ్యేయం.
- హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా బిల్లును వెనక్కి తీసుకోవాలి
నవతెలంగాణ-హైదరాబాద్
దేశంలోని యూనివర్సిటీలు, అన్ని విద్యాసంస్థల్లో విద్యార్ధి సంఘాత్య్వ ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఎఫ్ఐ జాతీయ నాయకులు డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ జాతీయ మహాసభలు జరుగుతున్న హైదరాబాద్ లోని మల్లు స్వరాజ్యం నగర్ (ఓయూలోని టాగూర్ ఆడిటోరియం)లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆలిండియా ఉపాధ్యక్షులు, దీప్సితాదర్, దీనితి డెంటా జాతీయ కార్యదర్శివర్గ సభ్యులు నితీశ్ నారాయణన్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టి.నాగరాజు, ఆర్ఎల్.మూర్తి డిమాండ్ చేశారు. వారు మీడియాతో మాట్లాడారు మెడికల్, ఇంజినీరింగ్, యూనివర్సిట్లో సీట్ల భర్తీ కోసం దేశవ్యాప్తంగా ఒకే కామన్ ఎంట్రెన్స్లో భాగంగా తీసుకొచ్చిన నీట్, జేరుఈ, సీయూఈటీలను వ్యతిరేకిస్తున్నామని నొక్కి చెప్పారు. దీనివల్ల చాలా మంది పిల్లలు చనిపోతున్నారంటూ తమిళనాడు ఘటనలను ఉదహరించారు.
కార్మికులు, రైతులు, పేదల పిల్లలను ఉన్నత చదువులకు దూరం. చేసే కుట్రు దీని వెనుక దాగి ఉన్నదని విమర్శించారు. రాజస్థాన్లోని కోట అనే చిన్నప్రాంతంతో నీట్ శిక్షణ పేరుతో కోచింగ్ సెంటర్ల మాసియా బుసలు కొడుతున్నదన్నారు. లక్షలాది రూపాయలు పెట్టి పేదల పిల్లలు అక్కడ ఎలా శిక్షణ తీసుకోగలుగుతారని ప్రశ్నించారు. ముఖ్యంగా గ్రామీణ పిల్లలంతా స్థానిక భాషల్లో, ఉన్నత వర్గాల వారి పిల్లలు ఇంగ్లీషు మీడియంలో చదువుతున్నారని. చెప్పారు. బాగా చదివే విద్యార్థులు కూడా సీట్లు పొందని పరిస్థితులు తలెత్తుతున్నాయని పలు ఉదాహరణలు తెలిపారు.
18 ఏండ్లకే విద్యార్థులు తమ ఓటు హక్కుతో ప్రధాని, సీఎం, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను ఎన్నుకుంటున్నారనీ, అలాంటిది విద్యాసంస్థల్లో ప్రజాస్వామిక వాతావరణ ఎందుకు ఉండొద్దని ప్రశ్నించారు. విద్యార్థులు ద్వితీయ పౌరులుగా బతకాలా? అని నిలదీశారు. ప్రభుత్వాల తీరు ఫ్యూడల్ వ్యవస్థను తలపించేలా ఉందని విమర్శించారు. విద్యార్ధి సంఘాల ఎన్నికలను నిర్వహించాలనే డిమాండ్లో తాము ముందుకు వెళ్లబోతున్నామని చెప్పారు. ప్రయివేటు యూనివర్సీటీలు, కళాశాలల్లోకి విద్యార్థి సంఘాలను అనుమతించకపోవడం దారుణమన్నారు. స్కాలర్ షిప్పులు రాకపోయినా, సరైన తిండి పెట్టకపోయినా అక్కడి వెళ్తేనే కదా విద్యార్థుల సమస్యలపై తాము పోరాడేదన్నారు. బిర్లా, టాటా, తదితర కార్పొరేట్ విద్యాసంస్థల సూచనల మేరకే నూతన విద్యావిధానంలో ప్రయివేటు వర్సిటీలు కళాశాల్లోకి అనుమతించొద్దనే నిబంధన పొందుపర్చారని విమర్శించారు.
పశ్చిమబెంగాల్లోని విశ్వభారతి విశ్వవిద్యాలయంలో ఎస్ఈపీకి వ్యతిరేకంగా 20 రోజుల పాటు ఆందోళనలు చేసిన విద్యార్థులను సస్పెండ్ చేయడం దారుణమన్నారు. విద్యార్థులకు ప్రశ్నించే హక్కులేదా? అని నిలదీశారు. పాలకులు అడుగడుగునా శారీరకంగా, మానసికంగా విద్యార్థులు కుంగిపోయే చేష్టలకు పాల్పడుతున్నారని విమర్శించారు. జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఆస్సలు ప్రజాస్వామికంలోనే మనం ఉన్నామా? అన్న ఆనుమానం కలుగుతున్నదన్నారు. మోడీ సర్కారులో దేశంలో విద్యావిధానంపైనే దాడి జరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా బిల్లుకు వ్యతిరేకంగా తమ మహాసభలో తీర్మానం చేశామనీ, కేంద్ర ప్రభుత్వం దాన్ని వెనక్కి తీసుకునేదాకా పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు. మహాసభలో ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ మరో తీర్మానం చేశామన్నారు. సహృద్భావ వాతావరణంలో రష్యా, ఉక్రెయిన్ దేశాలు ముందుకొచ్చి యుద్ధానికి ముగింపు పలకాలని కోరారు. యుద్ధం వల్ల చిన్నపిల్లలు, వృద్ధులు, ప్రజలు, సైనికులు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారని వాపోయారు. ఆ రెండు దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధాన్ని సాకుగా తీసుకుని నాటో దళాలు ఆయా ప్రాంతాల్లో విస్తరించే దిశగా ముందుకెళున్న విషయాన్ని పసిగట్టాలని సూచించారు. ఎన్ఎస్ఈపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తున్నామని చెప్పారు.