Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఓ దొంగ ఏకంగా పోలీసుల వాహనాన్నే చోరీ చేసిన ఘటన చోటుచేసుకుంది. సూర్యాపేటలో కొత్త బస్టాండ్ వద్ద పోలీసులు TS 09 PA 0658 నంబరు కలిగిన పెట్రోలింగ్ వాహనాన్ని నిలిపి ఉంచారు. వేరే కేసు కోసం గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు వెళ్లగా, వాహనాన్ని గుర్తు తెలియని దుండగుడు చోరీ చేశాడు. ఆ సమయంలో వాహనానికే తాళం ఉండటంతో వేసుకెళ్లిపోయాడు. ఈ తెల్లవారుజామున 5 గంటలకు ఈ ఘటన జరిగింది.
తమ వాహనం కనిపించకపోవడంతో పోలీసులు గాలింపు చర్యలను మొదలు పెట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా వాహనం వెళ్లిన దారిని గుర్తించారు. కోదాడ వద్ద దుండగుడిని అదుపులోకి తీసుకుని, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.