Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : యాజమాన్య కోటా ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల కోసం మరోసారి రిజిస్ట్రేషన్కు అవకాశం కలిపిస్తూ కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ ప్రకటన విడుదల చేసింది. యాజమాన్య కోటా ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లకు ఇప్పటికే మూడు విడతల కౌన్సిలింగ్ పూర్తి అయింది. గతంలో రిజిస్ట్రేషన్ చేసుకోని అభ్యర్థులకు మరో అవకాశం కల్పించాలని విద్యార్థులు తల్లిదండ్రులు యూనివర్సిటీ, ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని ఖాళీ సీట్లకు ఇప్పటికే ఉన్న ప్రవేశాల జీవోను సడలిస్తూ ఈ ఒక్క ఏడాది రిజిస్ట్రేషన్కు మరో అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం నేడు రిజిస్ట్రేషన్కు ప్రకటన విడుదల చేసింది. అభ్యర్థులు నేరుగా ఈ నెల 17 వ తేదీన కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్లోని హెల్ప్ లైన్ సెంటర్లో ఉదయం 9 గంటల నుండి సాయింత్రం 4 గంటల వరకు సంబంధిత ధ్రువపత్రాలతో హాజరు కావలసి ఉంటుంది. నిబంధనలు పూర్తి వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్సైట్ www.knruhs.telangana.gov.in లో చూడవచ్చని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.