Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఢిల్లీ నగర్ నిగమ్ బాలికా విద్యాలయలో వందన అనే చిన్నారి ఐదో తరగతి చదువుతోంది. అయితే ఇవాళ ఉదయం 11:15 గంటల సమయంలో టీచర్ గీతా దేశ్వాల్ వందనను మందలించింది. ఆ తర్వాత చిన్నారిపై కత్తెరతో దాడి చేసింది. అంతటితో ఆగకుండా బాధిత విద్యార్థినిని మొదటి అంతస్తు నుంచి కిందకు తోసేసింది. విద్యార్థినిపై దాడిని తోటి టీచర్ రియా అడ్డుకోబోయినప్పటికీ ఆమె వినిపించుకోలేదు. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న చిన్నారిని చికిత్స నిమిత్తం బారా హిందూ రావు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. టీచర్ గీతా దేశ్వాల్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే వైద్యులు సమాచారం మేరకు బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.