Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: భారత్ రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్లు కోల్పోయి 258 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్లో పూజారా శతకం సాధించాడు. బంగ్లా స్పిన్నర్లపై ఎదురుదాడికి దిగి ఎడాపెడా బౌండరీలు బాదాడు. డ్రింక్స్ బ్రేక్ తర్వాత మూడో ఓవర్లోనే పూజారా సెంచరీ మార్క్కు చేరువయ్యాడు. 130 బంతుల్లోనే 14 ఫోర్లతో వ్యక్తిగతంగా వేగవంతమైన సెంచరీ నమోదు చేశాడు. ఈ సెంచరీ అతనికి చాలా ప్రత్యేకం. ఎందుకంటే 52 ఇన్సింగ్స్ల సుదీర్ఘ కాలం తర్వాత అతను శతకం చేశాడు. ప్రస్తుతం బంగ్గాదేశ్ రెండో ఇన్నింగ్స్లో 12 ఓవర్లలో 42 పరుగులతో కొనసాగుతుంది.