Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: టీమిండియా, బంగ్లాదేశ్ మధ్య చట్టోగ్రామ్ లో జరుగుతున్న తొలి టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. ఈ మ్యాచ్ లో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 404 పరుగులు చేయగా, బంగ్లాదేశ్ 150 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఆట చివరికి బంగ్లాదేశ్ జట్టు రెండో ఇన్నింగ్స్ లో వికెట్ నష్టపోకుండా 42 పరుగులు చేసింది. ఓపెనర్లు నజ్ముల్ హుస్సేన్ శాంటో 25, జకీర్ హుస్సేన్ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకుముందు, తన రెండో ఇన్నింగ్స్ ను 258-2 స్కోరు వద్ద డిక్లేర్ చేసిన టీమిండియా బంగ్లాదేశ్ కు 513 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.