Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: నిన్న పార్లమెంటు సమావేశాలకు హాజరైనకాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మెట్లు దిగే తరుణంలో జారిపడ్డారు. ఎడమ కాలు బెణకడంతో ఓ దశలో నడవడానికి కూడా ఇబ్బంది పడ్డారు. నొప్పి తీవ్రం కావడంతో ఆస్పత్రికి వెళ్లారు. కాలుకు బ్యాండేజ్ వేయించుకున్న థరూర్ తన తన నివాసానికే పరిమితమయ్యారు. ప్రస్తుతం తాను నడవలేని స్థితిలో ఉన్నానని, నియోజకవర్గంలో కార్యక్రమాలను రద్దు చేసుకున్నానని ట్వీట్ చేశారు. ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నానని తెలిపారు.