Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కేరళలోని కోజికోడ్ పరిధికి చెందిన నితిన్ అనే యువకుడు బెంగళూరులోని ఏఎంసీ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుకుంటున్నాడు. ఇతడి తల్లిదండ్రులు ఇద్దరూ దుబాయ్లో పని చేస్తుంటారు. అయితే నితిన్కు తల్లిదండ్రులు అంటే ఎంతో ప్రేమ. తల్లిదండ్రులు తనకు దూరంగా ఉండడం ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు. కానీ కుటుంబ పోషణ నిమిత్తం వారు కూడా చాలా కాలంగా అక్కడే ఉంటున్నారు. ఈ తరుణంలో పలుమార్లు వారికి పోన్ చేసి, చూడాలని ఉంది వచ్చేయండని కోరుతూ ఉండేవారు. కనీ వివిధ కారణాలతో వారు రావడానికి వీలు కాలేదు.
డిసెంబర్ 14న తలనొప్పిగా ఉందంటూ మిత్రుడికి చెప్పి హాస్టల్ గదిలోనే పడుకున్నాడు. తోటి మిత్రులు కళాశాల అనంతరం సాయంత్రం హాస్టల్కి వచ్చారు. అయితే ఎంత పిలిచినా నితిన్ తలుపులు తీయలేదు. దీంతో హాస్టల్ వార్డెన్, సిబ్బంది సమాచారం అందించారు. చివరకు అంతా కలిసి బద్దలుకొట్టి గదిలోకి వెళ్లగా మరుగుదొడ్డిలో రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. మానసిక ఒత్తిడికి గురైన నితిన్ గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.