Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: పల్నాడు జిల్లాలోని మాచర్లలో టీడీపీ నేత జూలకంటి బ్రహ్మారెడ్డి, టీడీపీ శ్రేణులపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో జూలకంటి పాల్గొన్నారు. వార్డుల్లో తిరుగుతున్న టీడీపీ నేతలపై రాళ్లు, కర్రలతో వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. మాచర్లలో టీడీపీ వాహనాలను ధ్వంసం చేశారని టీడీపీ కార్యకర్తలు ఆరోపించారు. వైసీపీ శ్రేణుల దాడిలో పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయాలు కాగా వైసీపీ శ్రేణులు రెచ్చిపోతున్నా మాచర్ల పోలీసులు చోద్యం చూస్తున్నారని టీడీపీ కార్యకర్తలు మండిపడ్డారు.