Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తెలంగాణలో 1,392 జూనియర్ లెక్చరర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ తరుణంలో పోస్టులకు ఇవాళ్టి నుంచి దరఖాస్తులు స్వీకరించాల్సి ఉంది. కానీ సాంకేతిక కారణాల వల్ల ఈ నెల 20 నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు టీఎస్పీఎస్సీ శుక్రవారం ప్రకటించింది.
అంతేకాకుండా దరఖాస్తు గడువును జనవరి 6 నుంచి జనవరి 10 కి పొడిగించింది. రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి తాజాగా విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1392 పోస్టులను భర్తీ చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు జేఎల్ పోస్టుల నోటిఫికేషన్ వెలువడలేదు. ఉమ్మడి రాష్ట్రంలో 2008లో నోటిఫికేషన్ జారీ చేశారు.