Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశంలో శనివారం నుంచి మరోసారి సీఎన్జీ ధరలను పెంచింది. ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ (ఐజిఎల్) శనివారం నుంచి ఢిల్లీ-ఎన్సిఆర్లో కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) ధరలను పెంచింది. ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ ఢిల్లీలో కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) ధరలను కిలోకు రూ.78.61 నుంచి రూ.79.56కి పెంచింది. నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్లలో కిలో సీఎన్జీ ధర రూ.81.17 నుంచి రూ.82.12కి పెరిగింది. గురుగ్రామ్లో సీఎన్జీ ధరలు ఇప్పుడు కిలోకు 87.89 రూపాయలుంది.దీపావళి పండుగకు ముందు అక్టోబర్లో సీఎన్జీ ధరలను పెంచారు.ఈ ధరల పెంపుతో ఓలా, ఉబర్ క్యాబ్ సర్వీసు ప్రొవైడర్లు ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. ఆటో ప్రయాణికులపై కూడా శనివారం నుంచి అదనపు చార్జీల భారం పడనుంది. సీఎన్జీ ధరల పెంపుతో పండ్లు, కూరగాయల ధరలు కూడా పెరగనున్నాయి.