Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: టీమిండియా, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో నాలుగో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ లో 6 వికెట్లకు 272 పరుగులు చేసింది. కెప్టెన్ షకీబల్ హసన్ 40, మెహిదీ హసన్ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. బంగ్లాదేశ్ గెలవాలంటే ఇంకా 241 పరుగులు చేయాలి. మరో 4 వికెట్లు తీస్తే టీమిండియా గెలుస్తుంది.
ఈ టెస్టులో టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తొలి ఇన్నింగ్స్ లో 404 పరుగులు చేయగా, బంగ్లాదేశ్ 150 పరుగులకే ఆలౌటైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ను 258/2 స్కోరు వద్ద టీమిండియా డిక్లేర్ చేసింది. తద్వారా బంగ్లాదేశ్ ముందు 513 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.