Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్:
తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. రోహిత్ ఇచ్చిన అఫిడవిట్లలో విద్యార్హతకు సంబంధించి తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపిస్తూ ఆయన ఫిర్యాదు చేశారు. ‘‘2009లో ఇచ్చిన అఫిడవిట్లో రోహిత్ ఇంటర్ వరకు మాత్రమే చదువుకున్నట్టు ఉంది. కానీ, 2018 ఎన్నికల అఫిడవిట్లో స్వీడన్లోని బీటీహెచ్ యూనివర్సిటీ నుంచి బీటెక్ (ఎస్) చేసినట్టు ఉందని తెలిపారు. తప్పుడు సమాచారం ఇచ్చి రోహిత్ రెడ్డి ఈసీని, ప్రజలను తప్పుదారి పట్టించారు. ఎన్నికల నియమావళి ప్రకారం ఆయనపై చర్యలు తీసుకోవాలి’’ అని రఘునందన్ ఈసీని కోరారు. రోహిత్ విద్యార్హతలపై అనుమానాలు ఉన్నాయంటూ మీడియా సమావేశం కూడా నిర్వహించారు.