Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: పాకిస్థాన్ మహిళా మంత్రి షాజియా మారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్ ఒక అణ్వస్త్ర దేశం అన్న సంగతిని భారత్ గమనించాలని హెచ్చరించారు. తమ అణ్వస్త్ర హోదా మౌనంగా ఉండేందుకు కాదని, అవసరమైతే వెనుకంజ వేసే ప్రసక్తేలేదని షాజియా స్పష్టం చేశారు. అంతే కాకుండా ఎలా జవాబు ఇవ్వాలో పాకిస్థాన్ కు తెలుసని, చెంపమీద కొడితే ఊరికే చూస్తూ ఉండిపోదని అన్నారు.
అదే స్థాయిలో బదులిస్తుంది. మా వద్ద అణుబాంబు ఉందన్న విషయం భారత్ మర్చిపోరాదు. హిందూయిజం, హిందుత్వ అంశాలు మోడీ ప్రభుత్వంలో విజృంభిస్తున్నాయి. భారత్ ముస్లింలను ఉగ్రవాదంతో ముడివేస్తోంది అంటూ మండిపడ్డారు. గుజరాత్ లో ఊచకోతకు కారకుడు మోడీ అంటూ భుట్టో వ్యాఖ్యానించారు. ఇప్పుడు భుట్టోకు మద్దతుగా షాజియా మారీ వ్యాఖ్యలు చేయడం గమన్హారం.