Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఒడిశాలోని బాలంగీర్ జిల్లాలో పాఠశాలలో క్రీడాపోటీలు జరుగుతున్న సమయంలో జావెలిన్ వచ్చి ఓ బాలుడి గొంతులోకి దూసుకుపోయింది. దీంతో ఆ బాలుడు తీవ్రగాయాలపాలయ్యాడు. సదానంద మెహర్ అనే 9వ తరగతి విద్యార్థి అగల్ పూర్ బాలుర పంచాయతీ ఉన్నత పాఠశాల మైదానంలో విద్యార్థులు జావెలిన్ త్రో ప్రాక్టీస్ తరుణంలో తోటి విద్యార్థి జావెలిన్ విసరగా అది సదానంద మెహర్ ఎడమ వైపు నుంచి దూసుకువచ్చింది.
సదానంద మెడకు ఎడమ వైపు నుంచి గడ్డం భాగంలో బలంగా గుచ్చుకుని, కుడి వైపు నుంచి కొద్దిగా బటయకు కూడా వచ్చింది. దీంతో ఆ బాలుడిని వెంటనే బాలంగిర్ లోని మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆ బాలుడి మెడ నుంచి జావెలిన్ ను సురక్షితంగా బయటకు తీశారు.