Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తర కాశీలో సోమవారం తెల్లవారుజామున 1.50 గంటలకు భూకంపం సంభవించింది. ఉత్తరకాశీకి 24 కిలోమీటర్ల దూరంలో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 3.1గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ తెలిపింది.ఉత్తరకాశీలో తెల్లవారుజామున భూమి కంపించడంతో ఇళ్లలో నిద్రపోతున్న జనం బయటకు పరుగులు తీశారు. గతంలోనూ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పలుసార్లు భూమి కంపించింది. వరుస భూప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు.