Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మహారాష్ట్రలో దారుణం జరిగింది. 16 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన 8 మంది నిందితులు ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం నిందితులందరూ పోలీసుల అదుపులో ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం.. పాల్ఘర్ జిల్లాకు చెందిన బాధిత బాలికను కలిసిన ఓ బాలుడు ఆమెకు మాయమాటలు చెప్పి సముద్ర తీర గ్రామంలోని ఓ ఖాళీ భవనంలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత అక్కడికి మరో ఏడుగురు నిందితులు వచ్చారు. ఆ తర్వాత అందరూ కలిసి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను సముద్రం ఒడ్డుకు తీసుకెళ్లి మరోమారు లైంగికదాడికి పాల్పడ్డారు. రాత్రంతా వేధింపులు ఎదుర్కొన్న బాలిక ఉదయం ఇంటికి చేరుకుంది. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడు సహా ఎనిమిది మందినీ అదుపులోకి తీసుకున్నారు. డిసెంబరు 16న ఈ ఘటన జరిగిందని, దాదాపు రాత్రి 8 గంటల సమయంలో బాలికపై మొదలైన లైంగిక దాడి తర్వాతి రోజు ఉదయం 10 గంటల వరకు కొనసాగిందని పోలీసులు తెలిపారు. నిందితులపై పలు సెక్షన్ల కింద నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.