Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మేడ్చల్: జవహర్ నగర్ చిన్నారి ఇందు కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఎట్టకేలకు చిన్నారి మృతి కేసులో మిస్టరీ వీడింది. ఇది ప్రమాదవశాత్తు జరిగిన ప్రమాదంగా పోలీసులు గుర్తించారు. ఆడుకోవటానికి అటుగా వెళ్లిన ఇందు.. ఎక్కడా సరైన ప్రదేశం లేకపోవడంతో మూత్ర విసర్జన కోసం చెరువు దగ్గరకి వెళ్ళింది. ప్రమాదవశాత్తు కాలు జారి చెరువులో పడిపోయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. చిన్నారి ఊపిరతిత్తుల్లోకి చెరువు నీరు వెళ్లింది. పోస్ట్ మార్టం రిపోర్ట్లో వైద్యులు క్లియర్గా చెప్పారు.