Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఖైబర్ ఫక్తూంఖ్వాలోని పోలీస్ స్టేషన్ ను తాలిబాన్లు ఆక్రమించినట్టు పాకిస్థాన్ లోని ప్రధాన వార్తా సంస్థ పీటీఐ తెలిపింది. పాకిస్థాన్ పోలీసులు వివరాల ప్రకారం బన్ను కంటోన్మెంట్ పరిధిలోని పోలీస్ స్టేషన్ ను తెహ్రీక్ ఇ తాలిబన్లు ఆక్రమించుకున్నారు. పోలీస్ స్టేషన్ లోని కౌంటర్ టెర్రరిజం బలగాలను తమ ఆధీనంలోకి తీసుకున్న ఉగ్రవాదులు తమ వారిని విడిపించుకుపోయారు. రిన్ని
దీంతో ఆ ప్రాంతంలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని పట్టుకుంటామని, పోలీస్ స్టేషన్ పై బయటి నుంచి దాడి చేశారా? లేదా పీఎస్ లో అధికారులతో అంతర్గతంగా కుమ్మక్కు అయి చేశారా? అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నట్టు తెలిసింది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.