Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢిల్లీ : తెలంగాణ కాంగ్రెస్లో సంక్షోభం మరింత ముదిరింది. పార్టీలో తమకు పదవులు ఇవ్వకపోవడంతో సీనియర్ నేతలంతా తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. దీంతో తమ పదవులను వారికి కట్టబెట్టాలని రాజీనామా చేసిన 12 మంది నేతలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్కు లేఖ రాశారు. ఈ తరుణంలోనే సీనియర్లు సమావేశాల మీద సమావేశాలు నిర్వహిస్తున్నారు. పరిస్థితి విషమిస్తోందని గ్రహించిన అధిష్టానం టీ కాంగ్రెస్పై ఫోకస్ పెట్టి టీ కాంగ్రెస్లో సంక్షోభానికి తెరదించే భాధ్యతను దిగ్విజయ్ సింగ్కు అప్పగించినట్టు తెలుస్తోంది. దిగ్విజయ్ సింగ్కు టీ కాంగ్రెస్ అడ్వయిజర్ భాధ్యతను అప్పగించినట్టు సమాచారం. త్వరలో టి.కాంగ్రెస్ నేతలతో దిగ్విజయ్ సింగ్ సమావేశ కానున్నట్టుగా తెలుస్తుంది.