Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని గుడ్లూరు మండలం మోచర్ల జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. రహదారి మరమ్మతు పనులు చేస్తున్న కార్మికులపై లారీ దూసుకెళ్లడంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ కార్మికుడిని హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది.